అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి. అధికారికంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన యోగాసనాలు కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన యోగాని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. యోగా సాధన చేయడం ద్వారా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.