Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Gannavaram Local news:అభివృద్ధికిచిరునామా తెలుగుదేశంప్రభుత్వం: ఏపీ ప్రభుత్వం విప్పు వెంకటరావు!

జిల్లా గన్నవరం,నున్న లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్**అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం**గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాం*అభివృద్ధి కి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వమని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయవాడ రూరల్ నున్నలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 28 లక్షల నిధులతో నున్న జిల్లా పరిషత్ పాఠశాల లైబ్రరీ, అలాగే గ్రౌండ్ చదును చేసే పనులకు శంకుస్థాపన చేశారు . అలానే 51.90 లక్షలు , 14 లక్షల నిధులతో నిర్మించిన రెండు రోడ్లను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ 29 వ వర్థంతిని పురస్కరించుకొని నున్న లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. గుంతలు లేని రోడ్లు కార్యక్రమం చేపట్టే స్థితికి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రహదారులను నిర్మించామని వెల్లడించారు. విద్యకు మంత్రి నారా లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసారని గుర్తు చేశారు.

చదువులో మాత్రమేకాకుండా ఆటలోను విద్యార్థులు రాణించాలని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి కూడు, గూడు , గుడ్డ అనే నినాదంతో అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించారని అన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ముఖ్య‌మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button