తెలంగాణ

అమెరికాలో ఘోర రోడ్ యాక్సిడెంట్.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం | USA Telugu Family Tragedy

అమెరికాలో ఘోర రోడ్ యాక్సిడెంట్.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం | USA Telugu Family Tragedy

అమెరికా వెళ్లిన ఒక తెలుగు కుటుంబం.. తిరిగి ఇంటికి రావాల్సిన వారు.. శవాలుగా వస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు.. క్షణాల్లోనే మంటల్లో కాలి బూడిద అయ్యారు.

ఈ విషాదకర సంఘటనతో హైదరాబాద్ సుచిత్రలోని వారి ఇంటి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.


ఏం జరిగింది?

హైదరాబాద్ సుచిత్రకు చెందిన శ్రీవెంకట్ (40), తేజస్విని (36) దంపతులు, ఇద్దరు పిల్లలు సిద్ధార్థ (9), మృదా (7).. సెలవుల కోసం అమెరికా వెళ్లారు.

డల్లాస్‌ నుంచి అట్లాంటాలోని తేజస్విని సోదరి ఇంటికి వెళ్లి, తిరిగి డల్లాస్‌ వస్తున్న సమయంలో గ్రీన్ కౌంటీ వద్ద ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది.


ఎలా జరిగింది ఈ దుర్ఘటన?

ఒక రాంగ్ రూట్‌లో వస్తున్న మినీ ట్రక్కు, వీరి కారు మీద బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగి.. నలుగురు సజీవ దహనమయ్యారు.

కారు పూర్తిగా కాలి బూడిద అయ్యింది.. అక్కడికక్కడే చనిపోయారు.


తీరికగా జీవితం ప్రారంభించబోతున్న వేళ..

శ్రీవెంకట్, తేజస్వినిలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ.. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 2013లో వివాహం చేసుకున్న ఈ జంట.. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లారు.

జీవితం ప్రారంభించి, స్థిరపడుతున్న సమయంలో ఈ ప్రమాదం వాటిని బూడిద చేసింది.


DNA ద్వారా గుర్తింపు:

కారు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌ఏ నమూనాలు సేకరించి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు.

వారి మృతదేహాలను హైదరాబాద్‌కు రప్పించేందుకు బంధువులు ప్రయత్నాలు ప్రారంభించారు.


ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?

తాజాగా ఫిలిప్పీన్స్‌లోని ఒక తెలుగు వైద్య విద్యార్థి పుట్టినరోజునే గుండెపోటుతో చనిపోవడం,
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో డ్రైవింగ్ ప్రమాదాలు, గ్యాస్ లీకేజ్, పూల్‌లో మునిగిపోవడం.. ఇలా తెలుగువారి మృతులు పెరుగుతూ ఉన్నాయి.

విదేశాలకు వెళ్ళే వారు భద్రతాపరంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker