AP NEWS: గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా
FINANCE COMMITEE MEETING
తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో, వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా మరియు సభ్యులుఅన్నే జార్జ్ మ్యాథ్యూ, డా. మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్, జ్యోతి నాగర్కోటి, అభయ్ మీనన్ తదితర సభ్యులు. పాల్గొన్న ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ జె. నివాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శశిభూషన్ కుమార్, డైరెక్టర్ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కృష్ణతేజ, ప్రిన్సిపాల్ సెక్రటరీ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జెసి శుభం బన్సల్ తదితరులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల గ్రామీణ స్థానిక సంస్థల నుండి సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ లు పాల్గొనగా అర్బన్ లోకల్ బాడీస్ ప్రతినిధులు మునిసిపల్ మేయర్, చైర్మన్ లు పాల్గొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న వ్యవస్థపై వివరిస్తూ గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్లు, జిల్లా పరిషత్లకు కేంద్రం నుండి నిధుల విడుదల, ఆపన్న హస్తం కొరకు, పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల నిర్మాణం, అర్బన్ ట్రాన్స్పోర్ట్, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితర ముఖ్యమైన అంశాలపై కేంద్రం నుండి నిధుల విడుదల కోసం, ఆర్థిక సాయం కొరకు కమిషన్ దృష్టికి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీసుకెళ్ళారు. సదరు నిధులు రాష్ట్రానికి ఇవ్వగలిగితే మరింత మెరుగ్గా పౌరులకు సౌకర్యాలు, సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తలు కమిషన్ దృష్టికి పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలను తీసుకెళ్తూ ఎం ఎస్ ఎం ఈ, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, పవర్ సబ్సిడీ మరింత నిధులు విడుదల చేయాలని, ఏపీ రీ ఆర్గనైజేషన్ పెండింగ్ అంశాలు, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, అసోచామ్, ఫ్యాప్సియా, డిఐసీసీఐ, ఎఫ్ఎస్ఎంఈ తదితర పారిశ్రామిక వేత్తలు కమిషన్ ను కోరారు.