ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా TDP నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ దఫాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయేకు అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది. వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం తెలిసిందే.
ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.