ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు భద్రత పెంచాలి.జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో- కన్వీనర్ పెంటేల బాలాజీ.
పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట
అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వరస ఘటనలతో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్రజాసంక్షమమే పరమావధిగా, అభివృద్ధే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఇది ఓర్వలేని ఆరాచక శక్తులు పవన్ను టార్గెట్గా చేసుకుంటున్నారని పేర్కొన్నారు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాల పర్యటన పర్యటనకు సిద్దమౌతున్న తరుణంలో భద్రతపై పునఃసమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.