ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: కిమ్స్ శిఖర హాస్పిటల్ లో సంక్లిష్టమైన స్ట్రోక్ కేసు విజయవంతం

RARE SURGERY IN KIMS HOSPITOL

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

కిమ్స్ శిఖర హాస్పిటల్ లో సంక్లిష్టమైన స్ట్రోక్ కేసును విజయవంతంగా చికిత్స కిమ్స్ శిఖర హాస్పిటల్, గుంటూరులో అధునాతన న్యూరోవాస్కులర్ విభాగం మరోసారి సంక్లిష్టమైన స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు. 76 సంవత్సరాల వ్యక్తి స్ట్రోక్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ కుడివైపు శరీర భాగం తరచూ బలహీనతకు గురి కావడంతో పాటు ఇబ్బందులకు గురవుతున్నడంతో కిమ్స్ శిఖర హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి నేతత్వంలో పరీక్షలు నిర్వహించి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసి కరోటిడ్ ధమనులలో కొవ్వు కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు పేరుకుపోవడం ( కరోటిడ్ ధమని వ్యాధి) గుర్తించారు. న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణరావు నేతృత్వంలో బ్రెయిన్ ఆంజియోగ్రామ్ నిర్వహించి మెదడులో రక్తనాళం కూడా బలహీన పడి ఉబ్బినట్లు, బుడగల లాంటి పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో రోగికి చికిత్స అందించడం క్లిష్టతరంగా మారింది. డ్యూయల్ ఆంటీ ప్లేట్లెట్ తెరిపిన ఉపయోగించి రోగికి చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ పద్ధతిలో ప్రమాదాలు మరియు ప్రయోజనాలు క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత న్యూరో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్, ఏకకాలంలో కరోటేడ్ ఆర్ట్ స్టెంటింగ్ మరియు అన్యురిజం కాయిలింగ్ విధానాన్ని నిర్వహించారు. ఇది రోగి పరిస్థితిని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడింది. ప్రక్రియ తర్వాత రోగి స్థిరంగా ఉండటంతో పాటు రోగిని ప్రభావితం చేసే పోకల్ వీక్నెస్ న్యూరోలాజికల్ సమస్యలు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ కేసులో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల( ధమనుల) పనితీరు అంచనా వేయడం, ఇతరత్రా ప్రమాద కారకాలను తెలుసుకోవడం జరిగింది. కిమ్స్ శిఖర హాస్పిటల్ లో మల్టీ స్పెషాలిటీ విభాగాల పర్యవేక్షణలో నిపుణులైన డాక్టర్ల బృందం ఆధునిక సాంకేతిక వైద్య విధానాన్ని అందిపుచ్చుకొని కేసును విజయవంతంగా నిర్వహించారని సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ రాజశేఖర్ మాలెంపాటి తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button