ఆంధ్రప్రదేశ్
AP LATEST NEWS: గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
AP HOME MINISTER SPEECH IN ASSEMBLY
గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ‘ఈగల్’ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి.. ‘ఈగల్ కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు.