Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

నేటి యువత నాటకాలు, కళలను ఆదరించాలి.ప్రత్తిపాటి.


మానవ సంబంధాలు బలహీనమవుతున్నట్టే ,కళా పరిషత్ లు, నాటక పరిషత్ ల పట్ల ప్రజల్లో ఆసక్తి, అదరణ నానాటికీ తగ్గుతున్నాయని, ప్రజాదరణ పెంచేలా కళాకారులు, కళాభిమానులు నేటికీ నాటకాలను ప్రజారంజకంగా కొనసాగించడం నిజంగా అభినందించాల్సిన విషయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం రాత్రి బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా జరిగిన ఎన్.టీ.ఆర్ కళాపరిషత్ నాటక పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చెడు ఆలోచనలను పారద్రోలి, మంచి ఆలోచనలతో సన్మార్గంవైపు నడిపించే శక్తి నాటకః, కళా పరిషత్ లకే ఉందని, నేటి యువత నాటకాలను ఆదరించాలని, కళాకారుల కష్టాన్ని, ప్రతిభను ప్రతిఒక్కరూ గుర్తించాలని పుల్లారావు సూచించారు కళలకు పుట్టినిల్లు చిలకలూరిపేట అని, అలాంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అదే విధంగా త్వరలోనే ఆడిటోరియం పనులు పూర్తిచేస్తామని మాజీ మంత్రి సభాముఖంగా స్పష్టంచేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button