Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్పల్నాడు

రసాయన రహితమే! ప్రకృతి వ్యవసాయ ధ్యేయం – జిల్లాలోని రైతులందరూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల శ్రేయస్సు కొరకు వ్యవసాయ శాఖ లో భాగమైన ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, రైతుల శ్రేయస్సు కొరకు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు మురళి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి కె.అమల కుమారి హాజరు కావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ సందర్శించడం జరిగింది. తరువాత ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక 9 సూత్రాల గురించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి వివరించడం జరిగింది.1. భూమిని 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంచాలి. దీనివలన భూమికి నిరంతరం కర్బనం చేకూరుతుంది, అంతేకాకుండా భూమిలో సూక్ష్మజీవులు శిలీంద్రాల ఉధృతి పెరుగుతుంది, భూమి సారవంతమవుతుంది.2. భూమిపై పంటల వైవిధ్యం పెంచాలి(15నుండి 20రకాలు) వ్యవసాయ క్షేత్రంలో పంటల వైవిధ్యం తీసుకురావాలి అంటే రక్షక పంటలు ఆకర్షణ పంటలు జీవవైవిద్య పంటలు వేయడం ద్వారా ప్రధాన పంటకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది 3. పంట వ్యర్ధాలను భూమిలో కలపాలి కప్పి ఉంచాలి ఈ విధానం ద్వారా భూమికి సూర్యరశ్మి నుండి రక్షణ లభిస్తుంది భూమికి కొంతమేర కర్బన పదార్థం చేకూరుతుంది.4. భూమిని దున్నకపోవడం ఈ విధానంలో భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి జరుగుతుంది. సూర్య తాపం భూమిలోని సూక్ష్మజీవులపై పడకుండా ఉంటుంది. కర్బన శాతం గాలిలో ఆవిరి కాకుండా ఉంటుంది.5. రైతు సొంత విత్తనం/ దేశీ విత్తనం ఈ విధానంలో రైతు తన సొంత విత్తనాన్ని తానే తయారు చేసుకోవడం వలన రైతుకి ఖర్చు తగ్గుతుంది చీడ పీడల నుండి తట్టుకునే శక్తి పంటకు లభిస్తుంది.6. పశువుల అనుసంధానం. రైతులకు అధనపు ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేసుకోవడంలో సహాయపడతాయి.7. జీవ ఉత్పేరకాల వాడకం ఘనజీవామృతం, ద్రవ జీవామృతం ,బీజామృతం, పంచగవ్య ఉపయోగించాలి.8. చీడపీడల నివారణ కొరకు సహజ సిద్ధమైన కషాయాలు తయారు చేసుకుని ఉపయోగించాలి.9. ఎట్టి పరిస్థితుల్లో రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు కలుపు మందులు ఉపయోగించకూడదు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button