వినుకొండ:- యోగాతో శారీరక సామర్థ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.. ఫాదర్ ప్రసాద్
వినుకొండ:- స్థానిక లోయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యోగ దినోత్సవము మరియు యోగా యొక్క ప్రాముఖ్యత వివరించారు. ప్రిన్సిపాల్ బాల శౌరయ్య అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఫాదర్.ప్రసాద్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ యోగ ఎంత ప్రాచీనమైనదో అంత అమూల్యమైనది,ఎంత పురాతనమైనదో అంతా నిత్య నూతనమైనది మనదేశంలో ఉద్భవించిన ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో యోగ ఒకటి,ప్రాచీన భారతీయ యోగ శాస్త్రం నేర్చుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. యోగాతో శారీరక సామర్థ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి.ఐదువేల సంవత్సరాలుగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగ విద్య ఆదిలో ఆధ్యాత్మికపరంగా ప్రాచుర్యం పొందితే,ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.రేపటి సమాజం ఆరోగ్యంతో కళకళలాడాలని తపించిన మహర్షుల ఆలోచనల నుంచి రూపొదిద్దుకున్నదే ఈ యోగ అని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు, విద్యార్థినీ,విద్యార్థులకు వారి తల్లిదండ్రులకుఅంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు వీర, మేరీ, శైలజ,రాజేశ్వరి, అనిలా,శారదా పాల్గొన్నారు.