AP NEWS: వ్యవసాయ వాతావరణ మార్పులు, తట్టుకునే అంశాలపై కీలక అవగాహన ఒప్పందం
INDIA - SRILANKA AGRIMENT
రాష్ట్ర సచివాలయంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం _ వ్యవసాయ వాతావరణ మార్పులు, వాటిని తట్టుకునే వివిధ అంశాలపై కీలక అవగాహన ఒప్పందంలు చేసుకున్నారు . శ్రీలంక మరియు భారతదేశం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణమైన వాతావరణ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పై ఒప్పంద పత్రంను మార్చుకున్నారు. ప్రపంచ ఆహార పథకం డైరెక్టర్, మన దేశపు తరుపున ఎలిజబెత్ ఫెయిరీ మరియు రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి _ వ్యవసాయం బుడితి రాజశేఖర్ ఒప్పంద పత్రం లపై సంతకాలు చేశారు. ఈ పథకాన్ని మన దేశములో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా మరియు తమిళనాడు రాష్ట్రములో 5 సంవత్సరముల వరకు అమలు పరచడం జరుగుతుంది . సన్న ,చిన్న కారు ,మహిళా రైతులను వ్యవసాయ రంగములో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన స్థానిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఆ పరిస్థితులను తట్టుకుని వారిని బలోపేతం చేయడం పధక ఉద్దేశము అని తెలిపారు. మన రాష్ట్రములో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యములో మొట్ట మొదటగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మరియు ఆహార పథకం భాగస్వాయంతో అమలు పరచడం జరుగుతుంది. ఈ పధక డైరెక్టర్ ఎలిజబెత్ ఫెయిరీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అమలు పరిచే విధానాల వల్ల సన్న, చిన్న ,మహిళా రైతులు తీవ్రంగా మారుతున్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని సుస్థిర వ్యవసాయం సాధించే దిశగా వారిని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది అని తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల చిన్న రైతులకు వారి ప్రాంతాలకు అనుగుణమైన స్థానిక సమాచార సూచనలను పొందటం వల్ల ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ, వాతావరణ వ్యతిరేక పరిస్థితులనుండి పంటలను రక్షించుకునే అవకాశం వుందని తెలిపారు.