Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Cyclone Threat: Effectively Prevent Crop Loss with 7 Best Sasya Rakshana Tips||తుఫాన్ ముప్పు: 7 ఉత్తమ సస్యరక్షణ చిట్కాలతో పంట నష్టాన్ని సమర్థవంతంగా నివారించండి

Cyclone Threat: Effectively Prevent Crop Loss with 7 Best Sasya Rakshana Tips||తుఫాన్ ముప్పు: 7 ఉత్తమ సస్యరక్షణ చిట్కాలతో పంట నష్టాన్ని సమర్థవంతంగా నివారించండి

సస్యరక్షణ:కృష్ణ జిల్లాలో వరి పైరు కోత దశలోనూ,కుప్పలు పనల మీద ఉన్నది.కాస్త ఆలస్యంగా వేసిన పొలాలలో పైరు చిరు పొట్ట దశ నుండి ఈనిక దశలో ఉన్నది. ఈదురు గాలులు మరియు వర్షాల వలన పంట నష్ట తీవ్రతను తగ్గించుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించవలెను.
వరి పంట చిరుపట్ట దశ నుండి ఈనిక దశలో ఉంటే అంతర్గత కాలువల ద్వారా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించాలి. పడిపోయిన పొలాలలో గింజలు రంగు మారకుండా మరియు మానుగాయ తెగులు వ్యాప్తి నివారణకు గాను ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.గింజ గట్టి పడే దశ నుంచి కోత దశలో ఉంటే నిల్వ నీటిని బయటికి పంపే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కంకులలో మొలకలు కనబడితే 50 గ్రాముల కళ్ళు ఉప్పును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.తద్వారా రంగు మారడమే కాకుండా గింజలు మొలకెత్తకుండా కూడా పైరును రక్షించుకోవచ్చును.
కోత కోసి కుప్పలు మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా టార్పాలిన్స్ (బరకాలు) కప్పుకొని నీళ్లు చేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.గింజలు రంగు మారకుండా మొలకెత్తకుండా ఉండేందుకు గాను కేజీ ఉప్పును 20 కేజీల పొడి ఊక తో కలిపి సుమారు క్వింటా ధాన్యానికి కలుపుకోవాలి.
మినుము పెసర పంటలు మొలక దశలో ఉన్నాయి కాబట్టి ముంపుకి గురైతే వీలైనంతవరకు పొలంలో ఉన్న మురుగునీరుని బయటకు పంపాలి. సూక్ష్మ పోషక ధాతు లోపాలు రాకుండా పంటను రక్షించుకోవాలి. ఇనుము ధాతు లోప సవరణకు అన్నభేది 20 గ్రాములు మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారి చేసుకోవాలి. అలానే తెగుళ్ల ఉధృతి నియంత్రణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవలెను.
పైన సూచించిన విధంగా తగు జాగ్రత్తలు రైతాంగం పాటించి తుఫాను వల్ల పంట నష్టాన్ని నియంత్రించుకోవాలని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker