ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత , శుభ్రత అందరి జీవితాల్లో భాగం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

పల్నాడు జిల్లా చిలకలూరిపేట

స్వచ్ఛత , శుభ్రత అందరి జీవితాల్లో భాగం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు.


స్వచ్ఛ ఆంధ్ర… స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతినెలా మూడో శనివారం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, స్వచ్ఛత…శుభ్రత అనేవి అందరి జీవితాల్లో భాగం కావాలన్నదే కార్యక్రమం యొక్క సదుద్దేశమని మాజీమంత్రి ప్రత్తిపాటి తెలిపారు. శనివారం స్థానిక ఎన్ఆర్‌టీ సెంటర్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే వాస్తవాన్ని ప్రజలంతా గ్రహించాలని, దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి మాదిరే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. చుట్టూ ఉండే వాతావరణం బాగుంటేనే అందరి ఆరోగ్యం.. ఆలోచనలు బాగుంటాయనే వాస్తవాన్నిప్రజలు గుర్తించాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేసిన మాజీమంత్రి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker