chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad news:12 యూనివర్సిటీల్లోకాంట్రాక్ట్‌ అధ్యాపకులనురెగ్యులరైజ్‌చెయ్యాలి-TUCT -JAC

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1200 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు కోరారు.బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జేఏసీ కన్వీనర్‌ డా. పరుశురాం, కో-కన్వీనర్‌ డా. విజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ — గత ఏప్రిల్‌లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులరైజేషన్‌ కోసం, యూజీసీ పే స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కోసం 11 రోజులపాటు నిరవధిక సమ్మె చేసినట్లు గుర్తు చేశారు.

ఆ సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి రెగ్యులరైజేషన్‌పై హామీ ఇచ్చినందువల్లే సమ్మెను విరమించామని వారు తెలిపారు.ఆ హామీకి ఇప్పటివరకు ఆచరణ రూపం ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆరు నెలలు గడిచినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని హామీని అమలు చేయాలి” అని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.ఈనెల 4న ఓస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ నుండి పరిపాలన భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ ర్యాలీకి టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరవనున్నట్లు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker