- పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈఏడాదికి 20% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయిస్తాం
- సంఘం నేతలతో చర్చల సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ స్పష్టీకరణ
ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని పీహెచ్సీ వైద్యులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ విజ్ఞప్తిచేశారు. పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈఏడాదికి 20% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కలిపి కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీపై జీఓ విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాత్రి సుమారు గంటపాటు పీహెచ్సీ వైద్యుల సంఘం నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ వైద్యులు పీహెచ్సీ విధులకు దూరంగా ఉండడం మంచిది కాదని హితవు పలికారు. వైద్యుల ట్రైబల్ అలవెన్సు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. PG MEDICAL AP NEWS :పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటాలో ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం
విధులకు వైద్యుల హాజరుపై వివరాలు సేకరిస్తున్నామన్నారు.
అయితే 2026-27 నుంచి కనీసం మూడేళ్ల పాటు 15% సీట్లను పీజీ ఇన్-సర్వీసు కోటాలో అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయించాలని సంఘం నేతలు సౌరభ్ గౌర్ ను కోరారు. పలువురు మాత్రం రెండేళ్లపాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పీజీ చదివిన ఆమె: అంబులెన్స్ డ్రైవర్గా సేవలు అందించే యువతి||She Completed PG and Serves as an Ambulance Driver
దీనిపై ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో ఇన్-సర్వీసు కోటా ఎంతవరకు ఉండాలన్న దానిపై నవంబరులోగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు. పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.







