గుంటూరు
IMA:ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరులోని ఐ ఎం ఏ హాల్లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్,
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మహేష్,
నగరశాఖ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారాయుడు,
కార్యదర్శి సాయి కృష్ణ,
సంయుక్త కార్యదర్శి డాక్టర్ రాధికారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని ఈ సందర్భంగా వైద్యులు చెప్పారు. భారతదేశంలో సాధన చేసే యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు.
ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఎంతగానో ఉందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు.