పీఎం విద్యా లక్ష్మి పథకం: ఉన్నత విద్య కోసం కేంద్రం ఇచ్చే రుణం, సబ్సిడీ, దరఖాస్తు విధానం||PM Vidya Lakshmi Scheme: Education Loan, Subsidy, Eligibility, and Application Process Explained
PM Vidya Lakshmi Scheme: Education Loan, Subsidy, Eligibility, and Application Process Explained
ఉన్నత విద్య చదివి జీవితంలో ఎదగాలన్న ఆశ కలిగిన అనేక మంది విద్యార్థులు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపాల్సిన పరిస్థితి ఎదుర్కుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం (PM Vidya Lakshmi Scheme) విద్యార్థుల కలలను నెరవేర్చడానికి పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు పైచదువులకు అవసరమైన రుణాన్ని సులభంగా పొందవచ్చు. అంతేకాక, కొన్నిసార్లు వడ్డీ రాయితీ లేదా వడ్డీ మాఫీ లభించటం ఈ పథకం ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యకు ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్రం రూపొందించింది. 2024 బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకానికి 2024 నవంబర్ 6న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పథకం ద్వారా టాప్ 860 క్వాలిటీ ఉన్నత విద్యా సంస్థల్లో సీటు పొందిన విద్యార్థులు రూ.15-16 లక్షల వరకు రుణం పొందవచ్చు. రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే కేవలం 3% వడ్డీ మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం సబ్సిడీ కల్పించటం ద్వారా విద్యార్థులపై ఆర్థిక భారం తక్కువ చేస్తోంది. కౌర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం వరకు వడ్డీ చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. రుణం తిరిగి చెల్లించడానికి 15 సంవత్సరాల సమయం కల్పించడం ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఉపాధి పొందాక వడ్డీ చెల్లించడానికి తగిన సమయం దొరుకుతుంది. ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు వడ్డీలో 100% మినహాయింపు లభిస్తుంది. 4.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 3% వడ్డీ రాయితీ లభిస్తుంది.
విద్యార్థులు ఈ పథకానికి అర్హత పొందేందుకు టాప్ ఇన్స్టిట్యూట్లలో సీటు సంపాదించి ఉండాలి, మెరిట్ ఆధారంగా సీటు రావాలి. ప్రభుత్వ పథకాలను ఇప్పటికే పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు. విద్యార్థి UG, PG లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం ఒకేసారి ఈ రుణం పొందవచ్చు. విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ https://pmvidyalaxmi.co.in/Index.aspx లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. స్టూడెంట్ లాగిన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఏ బ్యాంకు నుంచి రుణం కావాలో వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి “Track Loan Application”లో స్టేటస్ తెలుసుకోవచ్చు.
పీఎం విద్యా లక్ష్మి ద్వారా లభించే రుణం CBDC వాలెట్ లేదా ఈ-వౌచర్ ద్వారా విద్యార్థికి అందుతుంది. మూడు నెలల్లోపు వాడకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కి వెళ్తుంది. ప్రతి సంవత్సరం చదువులో విద్యార్థి ప్రగతిని బట్టి ప్రయోజనం కొనసాగించబడుతుంది. విద్యార్థులు వడ్డీ రాయితీ కోసం దరఖాస్తు చేయాలంటే “Apply for Interest Subvention” ఆప్షన్ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసి రిక్వెస్ట్ చేయాలి. సమస్యలు ఎదురైతే “Initiate Grievance” సెక్షన్లో ఫిర్యాదు నమోదు చేసి సమస్య పరిష్కారం పొందవచ్చు.
దరఖాస్తు కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, 10వ లేదా 12వ తరగతి మార్కుల జాబితా, ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ కార్డ్, ఫీజు రసీదు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వివరాలను అప్లోడ్ చేయాలి. చదువును మధ్యలో ఆపిన విద్యార్థులు (వైద్య కారణాలు మినహాయింపు), క్రమశిక్షణ కారణంగా తొలగించబడినవారు, ఇతర ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందినవారు ఈ పథకానికి అర్హులు కావు.
తప్పుడు సమాచారం ఇస్తే విద్యార్థికి ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారు. రుణం పొందిన విద్యార్థి భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల నుండి నిషేధం విధించబడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం లక్షల మంది విద్యార్థుల జీవితంలో వెలుగు ప్రసరించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఉన్నత విద్యలో కొనసాగలేకపోతున్నవారికి ఇది ఒక దారి చూపించే అద్భుత అవకాశంగా నిలుస్తుంది.