Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేట

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట.
ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిచిన ప్ర‌జా నాయ‌కుడు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాల‌ని కోరుతుంటార‌ని, ఈ కోవ‌కే చెందిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెల‌లో 14 రోజుల పాటు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ కొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీస్తున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే, ఆ స‌మ‌స్య‌ల సాధ‌న‌కోసం కృషి చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ‌సిస్తున్నార‌ని ఇందులో భాగంగానే జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే మ‌న్యంతో కాలిన‌డ‌కన తిరిగి ఆ ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపారని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడం, ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు మార్గాలు అన్వేషించ‌టం, వాటిని ప‌రిష్క‌రించ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జిల్లాల పర్యటన ఉద్దేశమ‌ని తెలిపారు. .
నాడు ప‌ర‌దాల మాటున జ‌గ‌న్‌..
2019 ఎన్నికల ముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన జగన్‌…ఒక్క సారి అధికారంలోకొచ్చాక ఆ జనానికి దూరమయ్యారని బాలాజి గుర్తు చేశారు. తాడేపల్లిలో ప్యాలెస్‌కు పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారని , రాజకీయ అవసరాలరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లలో కూడా పడకుండా తప్పించుకుని తిరిగొచ్చారని ఆరోపించారు. అయిదేళ్లూ జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశాన్నే కల్పించలేదన్నారు. ‘స్పందన’పేరుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానంటూఅధికారంలోకొచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, తర్వాత వదిలేయడం, ఇదీ జనం పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్‌ కల్యాణ్‌ అంటూ జనసేన అధ్యక్షుడిని దారుణంగా కించపరిచారని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారని వెల్ల‌డించారు. జగన్‌ 175 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 11 స్థానాలకే పరిమితమయ్యారని, 100 శాతం ఫలితాలు సాధించిన పవన్‌కు, కేవలం 6% సాధించిన జగన్‌కు పోలికెక్కడ ప్ర‌శ్నించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button