chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేట

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట.
ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిచిన ప్ర‌జా నాయ‌కుడు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాల‌ని కోరుతుంటార‌ని, ఈ కోవ‌కే చెందిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెల‌లో 14 రోజుల పాటు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ కొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీస్తున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే, ఆ స‌మ‌స్య‌ల సాధ‌న‌కోసం కృషి చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ‌సిస్తున్నార‌ని ఇందులో భాగంగానే జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే మ‌న్యంతో కాలిన‌డ‌కన తిరిగి ఆ ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపారని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడం, ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు మార్గాలు అన్వేషించ‌టం, వాటిని ప‌రిష్క‌రించ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జిల్లాల పర్యటన ఉద్దేశమ‌ని తెలిపారు. .
నాడు ప‌ర‌దాల మాటున జ‌గ‌న్‌..
2019 ఎన్నికల ముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన జగన్‌…ఒక్క సారి అధికారంలోకొచ్చాక ఆ జనానికి దూరమయ్యారని బాలాజి గుర్తు చేశారు. తాడేపల్లిలో ప్యాలెస్‌కు పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారని , రాజకీయ అవసరాలరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లలో కూడా పడకుండా తప్పించుకుని తిరిగొచ్చారని ఆరోపించారు. అయిదేళ్లూ జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశాన్నే కల్పించలేదన్నారు. ‘స్పందన’పేరుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానంటూఅధికారంలోకొచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, తర్వాత వదిలేయడం, ఇదీ జనం పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్‌ కల్యాణ్‌ అంటూ జనసేన అధ్యక్షుడిని దారుణంగా కించపరిచారని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారని వెల్ల‌డించారు. జగన్‌ 175 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 11 స్థానాలకే పరిమితమయ్యారని, 100 శాతం ఫలితాలు సాధించిన పవన్‌కు, కేవలం 6% సాధించిన జగన్‌కు పోలికెక్కడ ప్ర‌శ్నించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker