
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలను, పత్రికలను మనకు అర్ధమయ్యే తెలుగులో చదవ గలుగుతున్నాం. తెలుగువారిగా మనమందరం ఆయనకు రుణపడి ఉన్నాం. గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం.
 
 
 
 






