Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవీడియోలువెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: నారా లోకేశ్ కు అంబటి రాంబాబు మాస్ వార్నింగ్

EX MINISTER AMBATI FIRE ON MINISTER LOKESH

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నారా లోకేష్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయాల్లో సంస్కార హీనంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చేరిగారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడని ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేష్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హద్దు మీరి వైయస్సార్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఈనెల 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లు పార్టీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker