Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: అమెరికా టారిఫ్ పెంపుపై గుంటూరులో వామపక్షాల నిరన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ సరుకులపై సుంకాన్ని 50%కు పెంచిన నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం గుంటూరు హిమని సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, టారిఫ్ పెంపు కారణంగా రాష్ట్ర ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, రొయ్యల ధరలు పడిపోవడంతో తీరప్రాంత రైతులు సంక్షోభంలో ఉన్నారని, వేలాది మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిందని తెలిపారు. వీసా నిబంధనల కఠినతరం వల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఎం నాయకుడు దండ లక్ష్మీనారాయణ, సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు జిల్లా కార్యదర్శి పాటిబండ్ల కోటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ప్రసంగించారు. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button