Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Guntur Election

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3వ తేదీన జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈమేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16 వ తేదీ ప్రకటించామని, ఓటర్ల లిస్టు, నోటిఫికేషన్ ను నగర పాలక సంస్థ నోటీసు బోర్డు లో ఏర్పాటు చేయటమైనదన్నారు. ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు జియంసి అదనపు కమీషనర్ ఛాంబర్ లో నామినేషన్ లు దాఖలు చేయవచ్చునన్నారు. 24వ తేదీ అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27 వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాన్నం 12 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్ధుల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం 10.30 నుండి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని, అదే రోజు 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని కమీషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button