గుంటూరు నగరపాలక సంస్థలో హైడ్రామా కొనసాగుతోంది. కమిషనర్ పులి శ్రీనివాసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు మేయర్ కావటి మనోహర్ నాయుడు సిద్దమయ్యారు. ఈ మేరకు వైసిపి కార్పొరేటర్ లతో కలిసి శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కౌన్సిల్ సమావేశానికి సిద్ధంగా లేని కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. వరదల సందర్భంగా తొమ్మిది కోట్ల 24 లక్షల రూపాయల అవినీతి జరిగిందని మేయర్ ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు కమిషనర్ స్పందించడం లేదని చెప్పారు. అయితే కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు.
Read Next
40 minutes ago
మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రావణ మాస సారి సమర్పణ||Sari Offering to Mavullamma Goddess in Shravan Month
56 minutes ago
తాడేపల్లిలో ప్రాణాల మీద శాపంగా కరెంట్ స్తంభం||Electric Pole Becomes Life Threat in Tadepalli
1 hour ago
పొగాకు కొనుగోలు కోసం రైతుల ధర్నా పిలుపు||Farmers Call Protest for Fair Tobacco Procurement
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
నరసరావుపేటలో వర్ష బాధితులకు అండగా ఎమ్మెల్యే చదలవాడ||MLA Chadalawada Responds Swiftly to Rain Havoc in Narasaraopet
1 hour ago
స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం – ఫిరంగిపురంలో కరపత్రాల పంపిణీ||CPM Campaigns Against Smart Meters – Pamphlet Distribution in Phirangipuram
2 days ago
Check Also
Close