Guntur News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్
Wellness Clinic in GGH
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్ది ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా అనేక విధాలుగా జబ్బుల బారిన పడుతున్నారని చెప్పారు. అయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ పని చేస్తుందని చెప్పారు. ప్రజలు తమ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు వెల్నెస్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.