డయల్ యువర్ కమిషనర్ కు ప్రజల నుండి అందే పిర్యాదులను 24 గంటల లోపు పరిష్కరించాలని, సంబంధిత విభాగాధిపతులు నేరుగా పిర్యాది దారునితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులు, అధికారులు, సిబ్బందితో డయల్ యువర్ కమిషనర్, గ్రీవెన్స్, ఎ.యం.యస్ మరియు 103 కాల్ సెంటర్ కు వచ్చిన వివిధ పిర్యాదుల పరిష్కారం పై సమీక్షా సమావేశం జరిగింది. సమావేశం నందు తొలుత సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి అందిన పిర్యాదుల పై, పి.జి.ఆర్.యస్, ఎ.ఎస్.యస్ మరియు 103 కాల్ సెంటర్ కు వచ్చిన పిర్యాదుల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పి.జి.ఆర్.యస్ కు వచ్చే పిర్యాదులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, ఎ.యం.యస్ పిర్యాదులను 48 గంటల లోపు పరిష్కరించాలన్నారు. నగర పాలక సంస్థ 103 కాల్ సెంటర్ వచ్చిన పిర్యాదులు అధిక మొత్తంలో ఉండుటతో అధికారుల పై వ్యక్తం చేసి, సదరు పిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే విభాగాల వారీగా ప్రతి విభాగంలో సూపరిండెంట్ అర్జీల పరిష్కారంకు భాధ్యత తీసుకోవాలని, ఆర్జీల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం డయల్ యువర్ కమిషనర్, పి.జి.ఆర్.యస్ మరియు ఎ.యం.యస్ ల పై సమీక్షా సమావేశం నిర్వహించుట జరుగుతుందన్నారు. ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదులను నిర్దేశిత గడువు మేరకు పరిష్కారించాలని, పిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయుటయే కాక అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను నిర్దేశిత గడువు మేరకు అందించడం ప్రభుత్వ ఉద్యోగుల భాధ్యత అని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, బి. శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్, ఈ.ఈ కోటేశ్వర రావు, ఎంహెచ్ఓ లక్ష్మి నారాయణ, మేనేజర్ బాలాజీ బాష విభాగాల అధికారులు, సూపరిండెంట్లు, యస్.యస్ లు సిబ్బంది పాల్గొన్నారు.
250 1 minute read