ఆంధ్రప్రదేశ్గుంటూరు
PAVNKALYAN :పవన్ కళ్యాణ్ కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం నంబూరు లో జరిగిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను సత్కరించి వారి సేవలను కొనియాడారు, వారికి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెరహెనీ క్రిస్టినా ఉప ముఖ్యమంత్రి తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి వారి జీతాలు పెంపుకు కృషి చేస్తానని ప్రకటించడం హర్షనీయమని ఆమె పేర్కొన్నారు, పలు విషయాలపై పవన్ కళ్యాణ్ తో ఆమె చర్చించారు కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి పలువురు అధికారులు పాల్గొన్నారు