ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు.[12] సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు.[13] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.[14] శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు.[15][16] గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.[17]
గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.