chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

Guntur News: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

Discuss on Water Projects

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.ఈమేరకు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు – ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చా గోష్టి జరిగింది. లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, వెనుకబడిన ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశ, తోటపల్లి బ్యారేజీ, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించి నిర్మాణం చేయుట ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలు సాగుదలకు వస్తుందని చెప్పారు. దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించడం హర్షదాయకమన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించి, గరిష్ట స్థాయిలో నీటిని నింపినప్పుడే ప్రాజెక్ట్ నిర్దేశిత లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు. ఈ చర్చా గోస్టిలో జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker