ఆంధ్రప్రదేశ్పల్నాడు
పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓలపై సస్పెండ్..
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓ లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా యడ్లపాడు-1 విఆర్ఓ మహబూబ్ సుభాని గొల్లపల్లి మండలం సరికొండ పాలెం విఆర్ఓ రవి నాయక్ లను సస్పెండ్ చేశారు. సరికొండపాలెం గ్రామంలో అసైన్డ్ భూములను తన కుటుంబ సభ్యుల పేరుతో విఆర్ఓ రవి నాయక్ ఆన్లైన్లో నమోదు చేశాడు. ఈ మేరకు ఇద్దరు విఆర్ఓ లను సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.