Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

సాహితీవేత్త దీవి రామ బ్రహ్మం కు గౌరవ డాక్టరేట్.

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట

సాహితీవేత్త దీవి రామ బ్రహ్మం కు గౌరవ డాక్టరేట్.


పట్టణానికి చెందిన సాహితీవేత్త దీవి రామ బ్రహ్మం కు గౌరవ డాక్టరేట్ లభించింది. తెలుగు సంస్కృతి, సాహితీ సేవా ట్రస్ట్ వారు రామబ్రహ్మం చేసిన సాహితీ కృషికి ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. విజయవాడ లో జరిగిన ఓ సాహితీ కార్యక్రంలో ఆదివారం ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. రామ బ్రహ్మం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తూ పదవి విరమణ చేసారు. వీరు మోక్షదర్శనం, ఆయుర్వేద వైద్య దర్శిని, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వదర్శిని వంటి ప్రామాణిక గ్రంధాలు రచించారు. అనేక సామాజిక, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సాహితీ సేవా రత్న వంటి ప్రతిష్టాత్మకమైన బిరుదులు అందుకున్నారు. రామ బ్రాహ్మంకు ఈ గౌరవ డాక్టరేట్ రావడం పట్ల పట్టణంలోని సాహితీవేత్తలు, కళాకారులు, డా..పీవీ సుబ్బారావు, దార్ల బుజ్జిబాబు, డా..విన్సెంట్ పాల్, ఏ.వి.శివయ్య, బుదాటి కోటయ్య, తదితరులు అభినందనలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button