BREAKING – GUNTUR LATEST NEWS: బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా తిరుపతిరావు
Appointed New BJP District President
భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు. ఈమేరకు లాల్ పురం లోని బిజెపి కార్యాలయంలో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు పార్టీ పరిశీలకులు శ్రీనివాసరాజు, కుమారస్వామి, కొత్తూరు సుబ్బారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం మొత్తం ఎనిమిది మంది పోటీపడి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచన మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో భారతీయ పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. బిజెపి సపోర్టుతోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు. అయినప్పటికీ సొంతగా పార్టీ బలోపేతం అవడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త అధ్యక్షుడు పైన అనేక బాధ్యతలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు.