Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్

గుంటూరు, 18 – 09 – 2025 గుంటూరు లోని పలు వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. గుంటూరు లోని వాసవి నగర్ మరియు రెడ్డిపాలెం ల లోని నిర్కీ సర్వీసెస్, షాహీ జామియా మసీదు లకు సంబంధించిన 260 ఎకరాల భూములను పరిశీలించారు. అనంతరం గుంటూరు లాలా పేట లోని షాహీ జామియా మసీదు కు విచ్చేసి ముత్తవల్లీలు, పేష్ ఇమామ్ లతో సమావేశమయ్యారు. భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తామని, ఆదాయాన్ని పెంచి నిరుపేద ముస్లిం ల అభివృద్ధి కి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీయా ను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా లోని పలు వక్ఫ్ సమస్యల పై ఇరువురు చర్చించారు. వారితో పాటు వక్ఫ్ బోర్డ్ సీఈవో మొహమ్మద్ అలీ, డీఆర్వో ఖాజావలి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఉన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button