విజయవాడ, సెప్టెంబర్ 18:
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ PG (Medical) Admissions 2025-26 కోసం Competent Authority Quota (In-Service మరియు Non-Service) సీట్లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది .
అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 19 ఉదయం 11:00 గంటల నుంచి సెప్టెంబర్ 25 రాత్రి 11:00 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో అప్లికేషన్ల తేదీలు తర్వాత ప్రకటించబడతాయి.
అర్హత కోసం NEET PG – 2025 కట్-ఆఫ్ మార్కులు (800లో):
- జనరల్/EWS – 276
- జనరల్ PwBD – 255
- SC/ST/OBC (PwBD సహా) – 235
ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సిన గడువు 31 జూలై 2025గా నిర్ణయించబడింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు స్థానిక/అస్థానిక హోదా నిబంధనలు పూర్తి చేస్తేనే అర్హులు. ఇన్-సర్వీస్ అభ్యర్థులు 16-04-2025 నాటికి 50 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.
ఫీజులు:
- రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు (AP లో MBBS పూర్తి చేసినవారు):
- OC/BC: ₹7,080
- SC/ST: ₹5,900
- AP వెలుపల MBBS పూర్తి చేసినవారు: అదనంగా వెరిఫికేషన్ ఫీజు ₹3,540.
- విదేశాల్లో MBBS పూర్తి చేసినవారు: వెరిఫికేషన్ ఫీజు ₹8,260.
- యూనివర్సిటీ ఫీజు (Non-refundable): ₹23,600.
- ట్యూషన్ ఫీజు (2024-25 ప్రకారం సమాచారం కోసం):
- క్లినికల్ కోర్సులు: ₹4,96,800
- పారా-క్లినికల్: ₹1,55,250
- ప్రీ-క్లినికల్: ₹70,380
సిద్దార్థ మెడికల్ కాలేజ్, విజయవాడను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థగా కొనసాగిస్తూ, లోకల్ అభ్యర్థులకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతం 65.62% మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతం 34.38% సీట్లు కేటాయిస్తారు. మిగతా 15% సీట్లు అన్రిజర్వ్డ్గా ఉంటాయి.
అభ్యర్థులు తప్పనిసరిగా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://drntr.uhsap.inను సందర్శిస్తూ తాజా అప్డేట్స్, సర్క్యులర్స్, కౌన్సెలింగ్ నోటీసులు పరిశీలించాలి.