Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

మేరికపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – రాజస్థాన్ యాత్రికుల బస్సు బోల్తా

ఫిరంగిపురం, సెప్టెంబర్ 20: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు జారి బోల్తా పడింది.

స్థానికుల సమాచారం మేరకు బస్సులో సుమారు 50 మంది యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

వార్త తెలిసిన వెంటనే ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగం, డ్రైవర్ అలసట, లేదా రోడ్డు పరిస్థితులు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button