Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
అమరావతిఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఎంజేపీ గురుకులాల్లో పదోన్నతుల సంబరాలు

అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత జోక్యం వల్ల ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు కదలిక వచ్చింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల పైల్‌కు జవులు వచ్చాయి. మొత్తం 30 మంది బోధన సిబ్బందికి పదోన్నతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతిలో ఎంజేపీ గురుకులాల్లో పదోన్నతుల సంబరాలు

ఈ మేరకు 16 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (TGT) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లుగా (PGT) ప్రమోషన్లు ఇవ్వగా, 14 మంది పీజీటీలకు ప్రిన్సిపాల్‌ పదవులు లభించాయి. పదోన్నతుల ప్రక్రియలో ఆలస్యం కారణంగా నిరుత్సాహంగా ఉన్న ఉద్యోగులకు ఇది పండగలాంటిదిగా మారింది.

ఈ మేరకు ఉన్నతాధికారులు మంత్రి సవితకు పదోన్నతుల అంశాన్ని తీసుకెళ్లగా, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంబంధిత ఫైళ్లు కదలికకు వచ్చి, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాయి.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ పదోన్నతులు తమకు లభించడంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button