chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి నిత్యాన్నధానానికి 10 టన్నుల కూరగాయల లారీ విరాళం – పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం

విజయవాడ, సెప్టెంబర్ 21:తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నేపధ్యంలో నిత్యాన్నధాన కార్యక్రమానికి విజయవాడ సురక్ష కమిటీ, వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల లారీని విరాళంగా పంపించారు. ఈ లారీని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి దంపతులు పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభించారు.

ఈ రోజు కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో, నిత్యాన్నధానం కోసం విరాళంగా ఇచ్చిన కూరగాయల లారీని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య, వెంకటేశ్వర భక్త సమాజ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:
“తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది భక్తులకు అన్నదానం చేయడం పరంపరగా కొనసాగుతోంది. ఇందుకోసం అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ రోజు విజయవాడ సురక్ష కమిటీ, వెంకటేశ్వర భక్త సమాజం తరఫున 10 టన్నుల కూరగాయలను టిటిడి నిత్యాన్నధానానికి అందిస్తున్నారు. ఇదొక విశేషమైన సేవా కార్యక్రమం,” అని పేర్కొన్నారు.

అలాగే, నగర భద్రతకు కూడా సురక్ష కమిటీలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. “ప్రస్తుతం నగరంలో దాదాపు 10 వేల సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఈ కమిటీలు ముఖ్యపాత్ర వహించాయి. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న సురక్ష కమిటీని అభినందిస్తున్నాను. అన్నదానం అత్యంత శ్రేష్ఠమైన దానం. అందుకే దీనికి చాలామంది ముందుకు వస్తున్నారు,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్., బొప్పన మహీనాథ్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, సురక్ష కమిటీ సభ్యులు, భక్త సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker