chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

బాపట్ల జిల్లా పరిపాలనలో నాణ్యతకు పెద్దపీట: కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్

బాపట్ల, సెప్టెంబర్ 22:జిల్లా పరిపాలనలో పారదర్శకత, నాణ్యత మరియు వేగవంతమైన సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పని చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బాపట్ల జిల్లా అన్ని పరిపాలనా విభాగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలి. ర్యాంకింగ్‌లలో మొదటి మూడింటిలో నిలవాలంటే ప్రతి ఉద్యోగి పోటీ ధోరణితో పనిచేయాలి,” అని పేర్కొన్నారు. ప్రజల నుంచి పి.జి.ఆర్.ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పూర్తిగా పారదర్శకంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పి.జి.ఆర్.ఎస్ కు సంబంధించి శాఖలు, మండలాల వారీగా నివేదికలు తయారు చేసి సమయానుకూలంగా అందించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినపుడు వెంటనే స్పందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డా. వినోద్ కుమార్ డిఆర్ఓను ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ డిఆర్ఓ ఆధ్వర్యంలో పనిచేసి, ప్రతి శాఖకు ఒక ప్రతినిధి ఉండేలా చూడాలని చెప్పారు.

అదేవిధంగా, రెండు టీవీలను కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి, న్యూస్ చానెళ్ల ద్వారా వచ్చే ముఖ్యమైన వార్తలను అధికారులకు వెంటనే తెలియజేసి, తగిన స్పందన తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, పరిపాలన అధికారి మల్లికార్జున రావు, పిజిఆర్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker