chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

క్రీడా అభివృద్ధికి కట్టుబాటు – రాష్ట్ర క్రీడా సంఘాలతో కీలక సమావేశం

విజయవాడ (22-09-2025)విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి క్రీడా సంఘాలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండీ ధరణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

🗣️ “క్రీడా సంఘాలు మారాలి – భవిష్యత్తు మారుతుంది” – మంత్రి రాంప్రసాద్ రెడ్డి

క్రీడా రంగంలో గత 15 నెలల్లో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని క్రీడా సంఘాలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియామకాల్లో ఉన్న 3 శాతం క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

క్రీడా సంఘాల మధ్య విభేదాలు తొలగించుకుని, ఏకతాటిపైకి రావాలన్న అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడలపై ఆసక్తిని వెలికితీయడం ద్వారా మాత్రమే రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

🏆 “3 శాతం కోటా – చారిత్రాత్మక నిర్ణయం” – శాప్ చైర్మన్ రవి నాయుడు

రాష్ట్రంలో క్రీడాకారుల కోసం 3 శాతం రిజర్వేషన్ సాధించడాన్ని చారిత్రాత్మకంగా పేర్కొన్నారు రవి నాయుడు. ఈ కోటాలో డీఎస్పీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని, గతంలో నియామకాల విషయంలో అవాంతరాలు ఎదుర్కొన్న అర్హులైన క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

క్రీడాకారుల భవిష్యత్తు కోసం క్రీడా సంఘాల సహకారం అత్యవసరం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ క్రీడా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం అపూర్వమని అన్నారు.

📋 “ఒక రాష్ట్రం – ఒకే సంఘం” విధానంపై దృష్టి – ఎండీ ధరణి

శాప్ ఎండీ ధరణి మాట్లాడుతూ, సంఘాల గుర్తింపు & పునరుద్ధరణలు NSDC–2011 మార్గదర్శకాలు, G.O.Ms.No.490 & G.O.Rt.No.272 ప్రకారమే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఒక రాష్ట్రానికి ఒకే సంఘం (One State One Association) విధానాన్ని అనుసరించాలని, కనీసం 50 శాతం జిల్లా సంఘాల అనుబంధం తప్పనిసరి అన్నారు.

ప్రతి సంఘం వార్షిక క్రీడా క్యాలెండర్ సమర్పించాలని, క్రీడా రిజర్వేషన్లు & ప్రోత్సాహకాలపై రాతపూర్వక సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం క్రీడా సంఘాలను క్రమబద్ధీకరించి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమేనని వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker