ఆంధ్రప్రదేశ్గుంటూరు
THADEPALLI NEWS .:రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ నీరు….
రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ నీరు….
ఆ రూట్లో వెళ్లాలంటే మురుగు కాలువ నీటితో కాళ్లు కడుక్కుని వెళ్ళాలి..
అది వాహనం మీద అయినా బాటసారులైన కాళ్లు ఒళ్ళు తడవాల్సిందే..
- తాడేపల్లి కొత్తూరు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిరంతరం ఇదే సమస్య
- 17వ వార్డు రైల్వే అండర్ పాస్ రోడ్డు ఇరువైపుల పైనుంచి నుంచి వచ్చు డ్రైనేజీ నీరు అండర్ పాస్ కిందకి చేరడంతో తప్పని తిప్పలు…
- పిల్లా పాపలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి అవస్థలు తప్పడం లేదు.
- డ్రైనేజీ నీరు బ్రిడ్జి కింద నిలబడిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోల సైతం మురుగు నీటిలో వెళ్లడానికి ఇబ్బందులు..
- ఓ పక్క డ్రైనేజీ పనుల నిమిత్తం రైల్వే గేటు రహదారి మూసి వేయడం జరిగింది, మరి వేరే దారి లేక ఈ అండర్ పాస్ కింద నుంచే వెళ్లవలసి వస్తుంది…
- తాడేపల్లిలో ఏ మూలకు వెళ్లిన డ్రైనేజీ సమస్యతో తప్పని ఇబ్బందులు…
- మండల కేంద్రానికి నిత్యం వివిధ గ్రామాల నుండి అనేకమంది ప్రయాణికులు, బాటసారులు వివిధ పనుల కోసం వచ్చి వెళుతుంటారు.
- నీటిలో ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో ఇంజన్లోకి నీరు చేరి వాహనాలు చెడిపోతున్నాయ..
- చినుకు పడితే చాలు వివిధ కాలువల ద్వారా, ఇండ్ల ద్వారా ఈ అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరి దుర్గంధాన్ని వెదజల్లుతూ అద్వాన్నంగా తయారైంది.
- సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించిన “ఇదిగో పులి,అదిగో తోక” అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.
- ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు మండిపడుతున్నారు
- డ్రైనేజీ నీరు నిలవ ఉండకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు….