Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్బాపట్ల

తిమ్మరాజుపాలెంలో ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి భూమిపూజ – MLA ఏలూరి సాంబశివరావు హామీ నెరవేర్చారు

తిమ్మరాజుపాలెం, సెప్టెంబర్ 24:దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తిమ్మరాజుపాలెం గ్రామ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త. గ్రామంలో ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఈరోజు గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ప్రజల సమక్షంలో నిర్వహించబడింది.

తిమ్మరాజుపాలెంలో ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి భూమిపూజ – MLA ఏలూరి సాంబశివరావు హామీ నెరవేర్చారు

గత ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ హామీని నెరవేర్చుతూ, రూ. 70 లక్షల 40 వేల జల జీవన్ మిషన్ నిధులను ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం మరియు గ్రామం మొత్తం కొత్త పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం కేటాయించారు.

ప్రస్తుతం ఆ నిధులతో పనులు ప్రారంభం కానుండగా, తొలి దశగా భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు MLA శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చర్యతో గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button