chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: గాంధీజి మార్గం అనుసరణీయం

GANDHI JAYANTI IN GUNTUR

అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన మార్గం అనుసరణీయమని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. జాతిపిత మహ్మత గాంధీజి 156వ జయంతి సందర్భంగా హిమని సెంటర్ లో ఉన్న  మహాత్మా గాంధీజీ విగ్రహానికి డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాలతో కలిసి మేయర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని గుర్తుచేశారు.  గాంధీజి ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి రైతులకు అందించిన సేవలను గుర్తుచేశారు. సత్యమే దైవమని, సత్యాన్నే ఆయుధంగా ఎంచుకోవాలని గాంధీజీ బోధించారని చెప్పారు. అహింస ద్వారా సాధించలేనిది ఏదీ లేదని, అహింస ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించవచ్చని నిరూపించారని అన్నారు. సత్యం కోసం, న్యాయం కోసం అహింసాత్మక పద్ధతుల్లో నిరసన తెలపడమే సత్యాగ్రహం అని సహాయ నిరాకరణ బ్రిటిష్ పాలనలో అన్యాయాలను ప్రతిఘటించడానికి, వారికి సహాయం చేయడాన్ని నిరాకరించడం ఒక ముఖ్యమైన ఆయుధం అని,  సామరస్యం, సమానత్వం గాంధీజీ సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ గాంధీజీ దేశం కోసం చేసిన సేవలను, స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్యం, సేవాభావం అనే గొప్ప అంశాలను ప్రపంచానికి అందించారని చెప్పారు. స్వచ్ఛ సమాజాన్ని ఆయన కోరుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 5 అవార్డులు,  జిల్లా స్థాయిలో 48 అవార్డులు రావడం గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హాసన్ భాషా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసు, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి,  తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker