chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

గుంటూరు, అక్టోబర్ 7: రామాయణ మహాకావ్యం ద్వారా మానవ సంబంధాలు, నైతిక విలువలు, కుటుంబ బాంధవ్యాలు, ఆదర్శ ప్రజాపాలన తదితర అంశాలను సమాజానికి అందించిన మహాకవి మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాల నాయకులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా చూపించిన విలువలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో పాటించాల్సినవేనని అన్నారు. వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే వాల్మీకికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ దిశానిర్దేశం అందించారని కలెక్టర్ గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందని వివరించారు. ప్రజల సూచనల ఆధారంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి అర్హులైన లబ్ధిదారులకు అందించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

వేడుకల్లో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వై. లక్ష్మీ శైలజ గౌడ్, విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు జంపని నాగేశ్వరరావు, టిడిపి బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసులు, ఏఎన్‌యూ రిటైర్డ్ లైబ్రరీయన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మహర్షి వాల్మీకి సాధారణ బోయ కుటుంబానికి చెందిన వారు కావడమే కాక, తపోనిష్ఠతో మహర్షిగా మారి రామాయణాన్ని రచించడం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందన్నారు. రామాయణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచి సమాజ అభ్యుదయానికి దోహదం చేయాలని నేతలు సూచించారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు, వివిధ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker