chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

ఎస్.ఆర్. శంకరన్ ఆదర్శం అధికారులకు మార్గదర్శనం కావాలి: కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్

బాపట్ల, అక్టోబర్ 7: ప్రముఖ ఐఏఎస్ అధికారి, ప్రజాసేవాకులైన ఎస్.ఆర్. శంకరన్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శంకరన్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “శంకరన్ సుదీర్ఘకాలం సుపరిపాలన, ప్రజా సంక్షేమం కోసం నిరంతరంగా పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయన స్పూర్తిని అనుసరించి, పేద ప్రజలకు సేవచేయాలనే తపనతో విధులు నిర్వర్తించాలి,” అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి శంకరన్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.

ఎస్.ఆర్. శంకరన్ ఆదర్శం అధికారులకు మార్గదర్శనం కావాలి: కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్

ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఫుడ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు, పతకాలు అందజేశారు.

ఫోరం కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు మాట్లాడుతూ, “శంకరన్ నిజాయితీ, నిస్వార్థం, నిరాడంబరతకు ప్రతీక. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది,” అని తెలిపారు. పరిపాలన ప్రజల దగ్గరకి తీసుకురావడంలో ఆయన పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఫోరం సభ్యులు జీవి, మానం అప్పారావు, కరణం రవీంద్ర, బందా బాబు, డా. వినోద్ (ఫుడ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు), వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker