అమరావతి, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో “కోటి సంతకాల సేకరణ కార్యక్రమం” ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల సంతకాలు సేకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సంతకాల ఆధారంగా నవంబర్ 26న గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తమ అభ్యంతరాలను తెలియజేయనున్నారు.
అంతేకాకుండా, ఈ నెల 10 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా “రచ్చబండ కార్యక్రమాలు” నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్నారు.
ఆందోళన కార్యక్రమాలలో భాగంగా:
- నవంబర్ 12న ప్రతి జిల్లా కేంద్రంలో ధర్నాలు
- నవంబర్ 28న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
- నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసనలు, మతిమరుపు కార్యక్రమాలు
ఈ నిర్ణయాలన్నీ వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమర్థనతో తాము ముందుకు వెళ్లనున్నట్టు వైఎస్ జగన్ స్పష్టం చేశారు.