chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

కమిషనర్ అలిమ్ భాషా, డాక్టర్ అనూషకు టీడీపీ నాయకుల సత్కారం

మంగళగిరి, అక్టోబర్ 7: స్వచ్ఛ ఆంధ్ర–2025 అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ ఎంటీఎంసీగా ఎంపికైన మంగళగిరి మున్సిపాలిటీకి ఈ ఘనత దక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును కమిషనర్ అలిమ్ భాషా స్వీకరించారు. ఇదే కార్యక్రమంలో, జిల్లాస్థాయిలో ఉత్తమ హాస్పిటల్‌గా ఎంపికైన గణపతి నగర్ ఇందిరానగర్ యూపీహెచ్సీకి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా మంగళవారం టీడీపీ నాయకులు వీరికి ప్రత్యేకంగా సన్మానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెదవడ్లపూడి గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, నాయకులు అలిమ్ భాషా కు శాలువా కప్పి, పూల మొక్కను అందజేశారు. అనంతరం గణపతి నగర్ యూపీహెచ్సీలో డాక్టర్ పీ. అనూష ను సత్కరించారు.

ఈ సందర్భంగా అన్నే చంద్రశేఖర్ మాట్లాడుతూ, మురికివాడలతో విస్తరించి ఉన్న మంగళగిరిలో పరిశుభ్రత పరంగా ఉన్నత సేవలందించిన కమిషనర్ అలిమ్ భాషా కృషి ప్రశంసనీయమని చెప్పారు. అలాగే, కేవలం మూడున్నర సంవత్సరాల సమయంలోనే ఇందిరానగర్ హెల్త్ సెంటర్‌కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్ రావడానికి కృషి చేసిన డాక్టర్ అనూష సేవలు పరిగణనీయమని కొనియాడారు.

ఆమె పరిశుభ్రత విషయంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో పాటు మూడు సంవత్సరాల్లో ముగ్గురు కలెక్టర్లు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నదీ అరుదైన ఘనత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే నంద కిషోర్, బోయపాటి రమేష్, రంగిశెట్టి పెద్దబ్బాయి, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker