Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
అమరావతిఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతి, అక్టోబర్ 8 :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీశైలంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, రహదారి మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి సూచించారు. అవసరమైతే ఇతర జిల్లాల సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు.

అకస్మాత్తుగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి పరిస్థతులు రాకుండా ఉండేందుకు, జాతీయ రహదారులపై ఎస్కేప్ రోడ్లు సిద్ధం చేయాలని సూచించిన మంత్రి, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button