chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు -జర్నలిస్టులకు శుభాకాంక్షలు – మీడియా అవసరాలకు పూర్తి సహకారం హామీ

అమరావతి, అక్టోబర్ 8:రాజధానిలో మీడియా వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటైన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలుపుతూ, “మీడియా స్వేచ్ఛకు మా పూర్తి మద్దతు ఉంటుంది. రాజధానిలో జర్నలిస్టులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని హామీ ఇచ్చారు.

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు -జర్నలిస్టులకు శుభాకాంక్షలు - మీడియా అవసరాలకు పూర్తి సహకారం హామీ

వెబ్‌సైట్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి కమిటీ సభ్యులు క్లబ్ అభివృద్ధికి తీసుకుంటున్న ప్రయత్నాలను సీఎం అభినందించారు. 2018లో అమరావతి ప్రెస్ క్లబ్‌ను స్థాపించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. అప్పటినుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, మీడియా వర్గాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నట్లు వివరించారు.

ప్రెస్ క్లబ్‌కు అత్యాధునికంగా భవనం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కూడా కమిటీ సభ్యులు వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రెస్ క్లబ్‌లు పరిశీలించి, వాటిని ఆదర్శంగా తీసుకొని డిజైన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. దీనికోసం అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని కోరగా, ముఖ్యమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు.

వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పాజీ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ట్రెజరర్ కె. పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ మహేష్, సభ్యులు శ్యామ్ సుందర్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, కె. గాంధీబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker