chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

నకిలీ మద్యం పెరిగిపోతుంటే… ఆరోగ్యశ్రీ మాత్రం ఆపేశారు – దొంతిరెడ్డి వేమారెడ్డి తీవ్ర విమర్శలు

మంగళగిరి: 10-10-2025 :-రాష్ట్రంలో నకిలీ మద్యం అంతకంతకూ పెరిగిపోతుంటే, పేదల ఆరోగ్యానికి ఆశగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడమేంటని మంగళగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“రాష్ట్రంలో వైద్యం లేదు… త్రాగునీరు లేదు… కానీ నకిలీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతోంది. ఈ నకిలీ మద్యం వల్ల ఇప్పటికే అనేకమంది తమ ప్రాణాలు కోల్పోయారు,” అని వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

“కూటమి ప్రభుత్వానికి చల్లని చూపు ఉంటే… నకిలీ మద్యం కేంద్రాలు ఎక్కడైనా ప్రారంభించవచ్చు,” అంటూ ఎద్దేవా చేశారు. కేవలం 10 లక్షల రూపాయల పెట్టుబడితో నకిలీ మద్యం కేంద్రం ప్రారంభించవచ్చని అధికారంగా నిరూపించినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి కేంద్రాలను అధికారులు గుర్తించారని వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, నకిలీ మద్యం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేతపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వేమారెడ్డి, “పేదవాడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వేలాది పేదల ప్రాణాలను కాపాడింది. ఆ పథకాన్ని నిలిపివేయడం అంటే పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే,” అని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker