పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల సంఖ్యలో విద్యార్ధులకు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్ధులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరతగతిన విద్యార్థులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.
1,011 Less than a minute